అమీర్‎పేటలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. తప్పిన ప్రమాదం

అమీర్‎పేటలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. తప్పిన ప్రమాదం
x
Highlights

హైదరాబాద్ లోని అమీర్‎పేట సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. మియాపూర్ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు అమీర్‌పేటలోని మెట్రో పిల్లర్ మధ్యలో ఉన్న డివైడర్‌ను బస్సు ఢీకొట్టి.

హైదరాబాద్ లోని అమీర్‎పేట సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. మియాపూర్ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు అమీర్‌పేటలోని మెట్రో పిల్లర్ మధ్యలో ఉన్న డివైడర్‌ను బస్సు ఢీకొట్టి. బస్సు బ్రేకులు ఫెయిలై ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న షాపు గోడలను, స్తంభాలను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రయాణికులెవరికి కూడా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమీర్ పేటల మెట్రో స్టేషన్ గోడ పెచ్చులూడిపడి ఆదివారం మౌనిక అనే యువతి మృతి చెందిన ఘటన జరిగిన కొద్ది సేపటికే మరో ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే అమీర్ పేటలో ఇలాంటి ఘటనలు జరగడంతో వాహనదారులు,పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories