ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టుకు రోహిత్‌రెడ్డి.. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని..

Rohit Reddy Attached The Documents To ED Notices With The Petition
x

Rohith Reddy: ఈడీ నోటీసుల దాకా పత్రాలు పిటిషన్‌తో జత చేసిన రోహిత్‌రెడ్డి

Highlights

Rohith Reddy: రేపు విచారణకు రానున్న రోహిత్ రెడ్డి పిటిషన్

Rohith Reddy: ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో రోహిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐఆర్ 48/2022 క్వాష్ చేయాలని.. ఈసీఐఆర్ 48/2022 లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14,19,21 ఉల్లంఘనకు ఈడీ పాల్పడిందన్నారు. ఈడీ తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు రోహిత్‌రెడ్డి. ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ల నుంచి ఈడీ నోటీసుల దాకా అన్ని పత్రాలను పిటిషన్‌తో జత చేశారు రోహిత్‌రెడ్డి. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories