నాలుగు లారీలు.. ఒక బస్సు విధ్వంసం

నాలుగు లారీలు.. ఒక బస్సు విధ్వంసం
x
Highlights

ముందు రెండు లారీలు వెనుక రెండు లారీలు మధ్యలో టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు. కరీంనగర్ రూరల్ ఇరుకుల్ల గ్రామ శివారు రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదం...

ముందు రెండు లారీలు వెనుక రెండు లారీలు మధ్యలో టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు. కరీంనగర్ రూరల్ ఇరుకుల్ల గ్రామ శివారు రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. హైవేపై వస్తున్న ఓ లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీ కొట్టింది. ఆ వెనకాలే వస్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు రెండో లారీని ఢీ కొట్టింది. ఆ వెంటనే బస్సును వరుసగా రెండు లారీలు ఢీ కొట్టాయి.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే లారీల మధ్య ఇరుక్కుపోవడంతో బస్సు డోర్‌ తెరుచుకోలేదు. దీంతో ప్రయాణీకులంతా అత్యవసర ద్వారాల గుండా బయటకువచ్చారు. అద్దాలను పగులగొట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనతో కరీంనగర్, రామగుండం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

keywords : karimnagar, road accident

Show Full Article
Print Article
More On
Next Story
More Stories