బీజేపీకి షాక్ ..పార్టీకి సీనియర్ నేత గుడ్ బై

కేంద్రప్రభుత్వం పూర్తి అబద్ధాలతో ప్రజలను మోసగిస్తుందని రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా బీజేపీకి సేవలు అందించానని అన్నారు. బీజేపీ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

admin
Published on: 1 Nov 2020 2:08 PM IST
బీజేపీకి షాక్ ..పార్టీకి సీనియర్ నేత గుడ్ బై
X

Ravula Sridhar reddy 

కేంద్రప్రభుత్వం పూర్తి అబద్ధాలతో ప్రజలను మోసగిస్తుందని రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా బీజేపీకి సేవలు అందించానని అన్నారు. బీజేపీ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇక కేసీఆర్ ద్వారా తెలంగాణ సాధ్యమైందని, గత 6 ఏళ్లుగా పురోగమిస్తుందని అన్నారు. దేశంలో తెలంగాణ అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారని అందుకే అయన నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించానని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.. ఇక అయన ఈ రోజు టీఆర్ఎస్ లో చేరనున్నారు. జూబ్లీహిల్స్ నుంచి 2018 ఎన్నికల్లో పోటి చేసిన అయన ఓడిపోయారు.

admin

admin

Next Story