పట్టాలపై పడబోయిన మహిళను కాపాడిన పోలీస్

పట్టాలపై పడబోయిన మహిళను కాపాడిన పోలీస్
x
Highlights

ప్రమాదాలు చెప్పి రావు మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు కమ్ముకొస్తుందో అసలే ఊహించలేం కానీ అనుకోకుండా పెను ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నప్పుడు మాత్రం...

ప్రమాదాలు చెప్పి రావు మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు కమ్ముకొస్తుందో అసలే ఊహించలేం కానీ అనుకోకుండా పెను ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నప్పుడు మాత్రం జీవితంపై భయం వేస్తుంది. ఆ క్షణంలో ప్రాణంపోయి ఉంటే అన్న భయం కుదిపేస్తుంది. సరిగ్గా అలాంటి భయమే కలిగిందో ప్రయాణికురాలికి. రైలు ప్రయాణంలో బోగీనుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ జారిపోయిందో మహిళ అయితే అదే ప్లాట్ ఫామ్ పై కాపలా కాస్తున్న ఓ పోలీస్ ఆమె పాలిట దేవుడిలా మారాడు బోగీనుంచి జారిపోతున్న ఆమెను ప్లాట్ ఫామ్ మీదకు అత్యంత లాఘవంగా లాగేశాడు.

అది సికింద్రాబాద్ నుంచి ధన్ పూర్ వరకూ వెళ్లే ఎక్స్ ప్రెస్ ట్రైన్ దాని నెంబర్ 12791 ఈ ట్రైన్ లోని ఎస్ 12 బోగీ నుంచి ఓ ప్రయాణీకురాలు దిగబోతోంది అంతలోనే ఏమైందో ఏమోకానీ ఆమె కాలుస్లిప్ అయి రైలుకు,ప్లాట్ ఫామ్ కు మధ్యకు జారిపోబోయింది అంతలో అదే రైలును గమనిస్తున్న రైల్వే రక్షణ దళ సిబ్బంది అప్రమత్తమయ్యాడు. రైలుకు , ప్లాట్ ఫామ్ కు మధ్యకు జారిపోతున్న ఆమెను అతి బలవంతం మీద బలమంతా ప్రయోగించి ప్లాట్ ఫామ్ పైకి లాగాడు. ప్రాణాపాయం నుంచి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన ఈనెల 18న జరిగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories