Telangana: తెలంగాణలోని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా

Postponement of Examinations in Telangana Universities
x

 తెలంగాణలోని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా

Highlights

Telangana: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసిన వర్సిటీలు

Telangana: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా వర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రస్మా డిమాండ్‌ చేసింది.

ఈ మేరకు ట్రస్మా ప్రతినిధులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుసుకుని వినతి పత్రం అందజేశారు. విద్యా సంస్థలను వెంటనే పున:ప్రారంభించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ రెడ్డి కూడా డిమాండ్‌ చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే సర్కారు సెలవులు ప్రకటించిందని పీడీఎస్‌యూ ఆరోపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories