YS Sharmila: తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్ల సోకు రాజకీయాలు

Politics Of Gangsters In Maharashtra with The Money Of Telangana People
x

YS Sharmila: తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్ల సోకు రాజకీయాలు

Highlights

YS Sharmila: దొర తెలంగాణకు ముఖ్యమంత్రా..‎? లేక మహారాష్ట్రకా...?

YS Sharmila: తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్ల సోకు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన పాపానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి తరలిపోయిందని... దొర తెలంగాణకు ముఖ్యమంత్రా... లేక మహారాష్ట్రకా...? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. బందిపోట్లలాగా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారన్నారు. ఇక్కడ తిరిగి సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు.. పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని షర్మిల ఎద్దేవా చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories