కల్నల్‌ సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం

కల్నల్‌ సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం
x
Highlights

దేశ ర‌క్ష‌ణ‌ కోసం ప్రాణ‌త్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు జ‌నం భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. సూర్యాపేటలోని ఆయన నివాసం...

దేశ ర‌క్ష‌ణ‌ కోసం ప్రాణ‌త్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు జ‌నం భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. సూర్యాపేటలోని ఆయన నివాసం ప‌రిస‌ర ప్రాంతాలు జన‌సందోహంగా మారాయి. గురువారం తెల్ల‌వారుజాము నుంచే క‌ల్న‌ల్ సంతోష్‌బాబు పార్థివదేహానికి జ‌నం నివాళులు అర్పిస్తున్నారు. సంతోష్‌బాబు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు బజార్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌, తదితరులు సంతోష్‌బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories