ఆర్టీసీ కార్మికుల సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలి : పవన్ కళ్యాణ్

ఆర్టీసీ కార్మికుల సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలి : పవన్ కళ్యాణ్
x
Highlights

డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులు చేస్తు్న్న ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విధుల నుంచి ఉద్యోగులను తొలిగించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. 1200 మందిని వినహా 48,660 మందిని ఉద్యోగాల నుంచి తొలిగించినట్లు వస్తు్న్న వార్తలు కలవరానికి గురి చేశాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో 17 రోజులు సమ్మె చేసి ఆర్టీసీ కార్మికులు ఉధ్యమానికి అండగా ఉన్నారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నానని ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories