BRS: వచ్చే వారం బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ .. 29 మంది సిట్టింగులకు టికెట్లు కట్

Next week BRS First List CM KCR Will Be Announced
x

BRS: వచ్చే వారం బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ .. 29 మంది సిట్టింగులకు టికెట్లు కట్

Highlights

BRS: డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 34 టికెట్లు ఇవ్వాలని నిబంధన

BRS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపికకు ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. టికెట్‌ కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు. టికెట్​ఎవరికి దక్కుతుంది, ఎవరెవరిని పక్కన పెడ్తారనే ఉత్కంఠ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో నెలకొంది. గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారమే ఫస్ట్​లిస్ట్ ​ప్రకటించే అవకాశం ఉంది. దీంతో టికెట్ దక్కుతుందో, లేదోనని సిట్టింగ్​ఎమ్మెల్యేల్లో టెన్షన్​నెలకొంది. మొత్తంగా 29 మంది సిట్టింగ్ ​ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇటు విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో సైతం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కత్తి మీద సాములా మారింది. కాంగ్రెస్‌లో ఉదయ్​పూర్​డిక్లరేషన్​పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సి ఉంది. అదే జరిగితే జనరల్ సీట్లలో టికెట్​ఆశిస్తున్న మిగతా నేతలు ఏం చేస్తారోనని కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్ సభకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్​అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ షురూ చేసింది.

కాంగ్రెస్‌కు టికెట్ల ఈక్వేషన్స్ తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్​ ప్రకారం సీట్లు కేటాయిస్తుండగా.. బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లంటూ ఏమీ లేకపోవడంతో జనరల్​కేటగిరీలోనే పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రతి లోక్​సభ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున బీసీలకు సీట్లు ఇవ్వాలని రాహుల్​గాంధీ తేల్చి చెప్పడంతో.. 34 మందికి టికెట్లు కేటాయించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. గతంలో కేవలం 25 మంది బీసీలకే టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్యను 34కు పెంచడంతో కొత్త ట్రెండ్​కు తెరదీశారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే, చాలా స్థానాల్లో పార్టీకి బలమైన బీసీ లీడర్లు లేరని పలువురు నేతలు అంటున్నారు. అలాంటి స్థానాల్లో బలమైన ఇతర వర్గాల అభ్యర్థులను కాదని, వేరే వారికి టికెట్లిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 31 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్​అయ్యాయి. అందులో 19 ఎస్సీలకు, 12 ఎస్టీలకు కేటాయించారు. రాహుల్ చెప్పినట్టు బీసీలకు 34 స్థానాలు ఇస్తే మిగిలేది 54 సీట్లు. అందులో హైదరాబాద్‌లోని 8 స్థానాల్లో ఎంఐఎం బలంగా ఉంది. ఆ సీట్లలో కాంగ్రెస్​సహా ఇతర పార్టీలు గెలవడం అసాధ్యమని పార్టీ నేతలు అంటున్నారు. అవి పోను ఉండేవి 46 సీట్లు. ఆ కొన్ని సీట్లలోనే ఇతర వర్గాల నేతలు అడ్జస్ట్​అవుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల బీసీలకు సీట్లిస్తే తమకు నష్టం జరుగుతుందన్న భావనలో పార్టీలోని కొందరు సీనియర్​నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అంగబలం, అర్థబలం లేని నాయకులకు సీట్లిస్తే.. పార్టీ నష్టపోతుందని ఓ సీనియర్​నేత పార్టీ పెద్దల దగ్గర వాపోయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తమ సీట్లు పోతాయనుకుంటున్న నేతలు.. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలంటూ పెద్దల ముందు తమ డిమాండ్​ను వినిపిస్తున్నట్టు తెలిసింది.

29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను దళపతి కేసీఆర్ మారుస్తారని బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఆయా స్థానాల్లో క్యాండిడేట్లను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. వీరిలో ఒకరిద్దరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్సీలు, మరికొందరు ఇతర పార్టీల నేతలతో పాటు పార్టీలోని ఆశావహులు ఉన్నట్టు సమాచారం. జనగామలో ముత్తిరెడ్డిని తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి చాన్స్ ఇస్తారని, స్వయంగా కేసీఆరే ఆయనను జనగామకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారని ప్రచారం జరుగుతోంది. ఇక స్టేషన్​ఘన్‌పూర్‌లో రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి చాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన 12 మందికి టికెట్ ఇస్తానని​ హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో వనమాపై ఉన్న డైలమా సైతం తొలగిపోయిందని, ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, 29 మంది సిట్టింగ్​లకు టికెట్లు ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణతో పాటే చత్తీస్​గఢ్, మధ్య ప్రదేశ్​లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఫస్ట్ లిస్టును బీజేపీ హైకమాండ్​విడుదల చేసింది. దీంతో తెలంగాణ బీజేపీలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణమైనా రాష్ట్రానికి చెందిన మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. వారితో పాటు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో సొంత పార్టీ లీడర్ల నుంచి పెద్దగా పోటీ లేదని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాలతోనే మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కనీసం 20 నుంచి 30 మందితో కూడిన ఫస్ట్ లిస్టును హైకమాండ్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ మొదటి జాబితాలో ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వంటి ప్రముఖుల పేర్లు ఉండనున్నాయి. వీరితో పాటు టికెట్ కోసం పోటీ లేదని భావించే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ హైకమాండ్​తోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంతంగా తమ టీమ్‌లతో సర్వే చేయించారు. ఆ నివేదికలతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ తరఫున సమర్పించిన జాబితాను పోల్చుకుని క్యాండిడేట్లను ఫైనల్​చేయనున్నట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్ భారీ కసరత్తే చేస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories