Telangana: తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

New Telangana Secretariat inauguration by CM KCR on 17th February
x

Telangana: తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Highlights

Telangana: ఉ. 11:30 నుంచి మ. 12:30 మధ్య ముహూర్తం

Telangana: ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్య ముహూర్తం మేరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, జార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్విని యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరపున ఆయన ప్రతినిధిగా JDU జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories