విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల చర్చలు విఫలం

Negotiations between the Authorities and the Parents of the Students Failed
x

విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల చర్చలు విఫలం

Highlights

Basara: ఇంఛార్జ్ వీసీతో చర్చలు జరిపిన తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్య పరిష్కారం వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇంఛార్జ్ వీసీతో చర్చలు జరిపిన తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 డిమాండ్లలో ఒకే ఒక్క డిమాండ్ నేరవేరిందన్నారు. పిల్లలను కలవనివ్వలేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్లు న్యాయం కోసం పిల్లలు పోరాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు సమయం ఇస్తే అన్ని హామీలు నెరవేస్తామన్నారు వీసీ వెంకటరమణ. మరోవైపు E3 విద్యార్థులకు సెమిస్టర్‌ బ్రేక్‌ సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. డిమాండ్ల పరిష్కారానికి మరో 48 గంటలే డెడ్‌లైన్ అంటూ విద్యార్థులు ట్వీట్ చేసిన గంటలోనే వీసీ సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories