మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‎కు దిమ్మతిరిగే తీర్పు ఇస్తారు

మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‎కు దిమ్మతిరిగే తీర్పు ఇస్తారు
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నేత డీకే అరుణ. ప్రజాప్రతినిధులను కేసీఆర్‌ డమ్మీలను చేశారని ఆరోపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నేత డీకే అరుణ. ప్రజాప్రతినిధులను కేసీఆర్‌ డమ్మీలను చేశారని ఆరోపించారు. వరంగల్‎లోని వనపర్తిలో మున్సిపల్‌ ఎన్నికలపై బీజేపీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవలాంటిదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నా క్యాడర్ లేదని ఎద్దేవాచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‎కు దిమ్మతిరిగేల తీర్పు ఇస్తారని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ.. తెలంగాణలో కేంద్ర పథకాలను కేసీఆర్‌ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను విస్మరించారని, నిరుద్యోగుల జీవితాలతోనూ కేసీఆర్ ఆడుకుంటున్నారని రామచంద్రరావు ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories