ప్రధాని మోడీని కలిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MP Komatireddy Venkat Reddy Met PM Narendra Modi | TS News Today
x

ప్రధాని మోడీని కలిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Highlights

Komatireddy Venkat Reddy: నమామి గంగ తరహాలో మూసీనది ప్రక్షాళనకు ప్రధాని మోడీకి కోమటిరెడ్డి వినతి

Komatireddy Venkat Reddy: ప్రధాని మోడీని కలిసేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ముందే అపాయింట్ మెంట్ తీసుకుంటుంటారు. అయినా ఒక్కో సందర్భంలో ప్రధాని అపాయింట్ మెంట్ కూడా లభించక ఎందరో నేతలు వెనుతిరిగిన సందర్భాలున్నాయి. అలాంటింది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన వెంటనే ప్రధాని మోడీని కలిసేందుకు సమయం అడిగిన అరగంటలోనే అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ప్రధాని మోడీకి వివరించారు. నమామి గంగ తరహాలో మూసి నది ప్రక్షాళన చేయాలని ప్రదానిని కోరినట్లు కోమటిరెడ్డి చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభం కావాల్సిన హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణం చేపట్టకుండా జీఎంఆర్ సంస్థ అర్భి్ట్రేషన్ కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తుందని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు కోమటిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories