Baithi Sridhar: విద్యావంతులు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే.. ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుంది

MLA Prakash Goud Does Not Care About Public Issues Says Baithi Sridhar
x

Baithi Sridhar: విద్యావంతులు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే.. ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుంది

Highlights

Baithi Sridhar: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు

Baithi Sridhar: విద్యావంతులు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుందన్నారు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్. ప్రజా సమస్యలపై అవగాహన కలిగితేనే వాటి గురించి చట్టసభల్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందని శ్రీధర్ తెలిపారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేరా మట్టి- మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్ హాజరయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. మేరా మట్టి- మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మట్టిని బియ్యాన్ని సేకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అనేక సమస్యలను గ్రామస్తులు శ్రీధర్ బృందం దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామానికి చెందిన ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయం అయిందని... ప్రధాన రహదారిపైనే రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 20 నిమిషాల సమయం పట్టిందంటే రోడ్డు పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాష్ గౌడ్ ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తన వ్యాపార లావాదేవీలను చూసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేకు లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories