రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా కేసులో ముగిసిన విచారణ

Minister KTR Defamation Case Against Revanth Reddy in City Civil Court
x

రేవంత్ రెడ్డి - కేటీఆర్(ఫైల్ ఫోటో)

Highlights

* రేవంత్‌కి నోటీసులు జారీ * డ్రగ్స్, ఈడీ కేసులు జరుగుతున్న కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశం

KTR Defamation Case: రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువునష్టందావా కేసులో సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్ కేసుతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories