Indrakaran Reddy: గవర్నర్‌ తమిళిసై వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు

Minister Indrakaran Reddy Protests in Nirmal | TS News Today
x

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరసన ప్రదర్శన

Highlights

Indrakaran Reddy: నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరసన ప్రదర్శన

Indrakaran Reddy: రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ టీఆర్ఎస్ తలపెట్టిన మూడో రోజు నల్లజెండాలను ఎగురవేసి నిరసన ప్రదర్శనలు చేశారు. నిర్మల్ లో ఇంద్రకర‌ణ్ రెడ్డి నల్లజెండాలను ఎగురవేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత గవర్నర్‌ తమిళిసై వక్రబుద్ధితో మాట్లాడుతోందని ఆరోపించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. గతంలో IAS, IPS లు గవర్నర్లుగా వచ్చేవారని, తమిళనాడు బీజేపీ నుంచి వచ్చిన తమిళిసై ఇప్పుడు కూడా బీజేపీ వైపే చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్‌ హుందాగా వ్యవహరించాలని, ఆ హోదాకు ఇచ్చే గౌరవం తప్పకుండా ఇస్తామని చెప్పారు ఇంద్రకరణ్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories