Harish Rao: సిద్ధిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Visiting Siddipet
x

Harish Rao: సిద్ధిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు

Highlights

Harish Rao: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ ప్రారంభం

Harish Rao: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రంజాన్ వేడుకలో ముస్లిం సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈద్గా మజీద్ వద్ద ముస్లిం సోదరులతో అలయ్ బలయ్ తీసుకొన్నారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు మంత్రి. మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ కు పరిమితమైన మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటిసారిగా మోకాళ్ళ చిప్పల ఆపరేషన్స్ ను విజయవంతం చేసిన డాక్టర్లను మంత్రి అభినందించి సత్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories