బీజేపీ తీరుపై నిప్పులు చేరిగిన మంత్రి హరీష్‌ రావు !

బీజేపీ తీరుపై నిప్పులు చేరిగిన మంత్రి హరీష్‌ రావు !
x
Highlights

బీజేపీ తీరుపై మంత్రి హరీష్‌ రావు నిప్పులు చెరిగారు. బీజేపీ ఓట్ల కోసం చిల్లర రాద్ధాంతాలు చేసే పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అబద్ధాల పునాదులపై బీజేపీ రాజకీయంగా ఎదుగుతుందని విమర్శించారు.

బీజేపీ తీరుపై మంత్రి హరీష్‌ రావు నిప్పులు చెరిగారు. బీజేపీ ఓట్ల కోసం చిల్లర రాద్ధాంతాలు చేసే పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అబద్ధాల పునాదులపై బీజేపీ రాజకీయంగా ఎదుగుతుందని విమర్శించారు. బీజేపీ కరోనాతో కూడా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వారా అని ప్రశ్నించారు. పఠాన్ చెరులో జీహెచ్ఎంసీ‌ ఎన్నికల సమావేశం పాల్గొన్న హరీష్‌ రావు... బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అబద్ద ప్రచాన్ని తిప్పి కొట్టాలని టీఆర్ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక ఎన్నిక హామీ మేరకు రూ. 251 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి‌ తాగునీరు సరఫరా చేస్తుందని తెలిపారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫారూఖ్ హూస్సెన్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ‌అటవీ అభివృద్ధి ‌సంస్థ ఛైర్మన్ ఒంటేరు‌ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories