బీజేపీదంతా దోఖేబాజీ మాటలే : మంత్రి హరీష్ రావు

బీజేపీదంతా దోఖేబాజీ మాటలే : మంత్రి హరీష్ రావు
x
Highlights

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఎలక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలక్షన్లలో భాగంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ...

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఎలక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలక్షన్లలో భాగంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్‌ రావు బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీడీ కార్మికులకు 1600 రూపాయలు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావే అవుతుంది. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. 16 పైసలు బీడీ కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలన్నారు. యూపీలో వృద్ధులకు,వితంతువులకు 500 రూపాయలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం..అదే కర్ణాటకలో 400 రూపాయలు పెన్షన్ ఇస్తుందన్నారు. గుజరాత్‌ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు.

బీజేపీదంతా దోఖేబాజీ మాటలేనని కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రూ. 500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో మాత్రం మన ప్రభుత్వం రూ. 2 వేలు పెన్షన్‌గా అందిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో బోర్లు, బావుల దగ్గర యూనిట్ కు 4 రూపాయలచొప్పున రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఎలా విమర్శిస్తున్నాయి. ఇక పోతే టీఆర్‌ఎస్‌ తరపున దుబ్బాక ఉపఎన్నికలో సోలిపేట సుజాత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా దుబ్బాక ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది.. ఉపఎన్నిక ఫలితం నవంబర్‌ 10న రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories