బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించిన హరీష్ రావు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించిన హరీష్ రావు
x
Highlights

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత తరపున ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత తరపున ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను సాధించి పెట్టారన్నారు. ఉద్యమంలో అమరులైన విద్యార్థుల మరణాలకు కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించిన హరీష్.. పదవీ వ్యామోహంతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు కూడా చేయలేదని విమర్శించారు. అటు దుబ్బాకలోని తొగుట మండలంలోని ప్రచారం నిర్వహించిన అయన రైతులకి, నిరుద్యోగులను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిండా ముంచాయని అన్నారు. ఇక తమ హయంలో కొత్తగా ఎనమిది వేల పరిశ్రమలు వచ్చాయని హరీష్ రావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories