ఆదిలాబాద్ జెడ్పీ సమావేశంలో ఆత్మీయత చాటుకున్న సభ్యులు

ఆదిలాబాద్ జెడ్పీ సమావేశంలో ఆత్మీయత చాటుకున్న సభ్యులు
x
Highlights

ఆదిలాబాద్ జిల్లాలో ఐదేళ్ల పాలన అనుబంధం..ప్రాంతాల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. జిల్లా పరిషత్ సభ్యుల పదవి...

ఆదిలాబాద్ జిల్లాలో ఐదేళ్ల పాలన అనుబంధం..ప్రాంతాల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. జిల్లా పరిషత్ సభ్యుల పదవి కాలం ముగియడంతో చివరి సమావేశంలో సభ్యులు పార్టీలు.. పదవులు పక్కకు పెట్టి జిల్లా అభివృద్ధిపై జరిగిన చర్చలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయతను చాటుకున్నారు. జెడ్పీ చైర్మన్.. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు సెల్ఫీ ఫొటోలు దిగారు.పదవీ కాలం ముగియడంతో ఐదేళ్లుగా జిల్లా అభివృద్ధికి కృషి చేసిన సభ్యులను రాష్ర్ట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సేవలో ముందుండాలని నేతలను ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అదిరోహించాలని ఆశీర్వదించారు. జిల్లా అభివృద్ధి లో సభ్యుల సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి కొనియాడారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories