టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను హతమార్చిన మావోయిస్టులు

టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను హతమార్చిన మావోయిస్టులు
x
Highlights

ఈ నెల 8న కిడ్నాప్ అయిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను మావోయిస్టులు హతమార్చారు. ఐదు రోజుల క్రితం శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. తామే...

ఈ నెల 8న కిడ్నాప్ అయిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను మావోయిస్టులు హతమార్చారు. ఐదు రోజుల క్రితం శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. తామే ఆయన్ని హత్య చేసినట్టు ఓ లేఖతో పాటు ఫోటోలను కూడా విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఎర్రంపాడు-పుట్టాడు రహదారిపై శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. ఎంపీటీసీ శ్రీనివాస్ పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీ నిర్మూలనకు పని చేస్తున్నారంటూ లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. మరోవైపు, మావోయిస్టుల ఘాతుకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories