భార్యను చంపి చనిపోయింది అంటు..ఖమ్మం జిల్లాలో దారుణం

Man Kills his Wife Two Months After Marriage Files Missing Complaint
x

Representational Image

Highlights

* భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త * కొత్తలంకపల్లి గ్రామ శివారులోని కుక్కల గుట్టలో మృతదేహం * రెండు రోజుల క్రితం భార్య కనిపించడం లేదని నాగశేషు రెడ్డి ఫిర్యాదు

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశాడు ఓ దుర్మార్గపు భర్త.. ఎర్రుపాలం మండలం అయ్యవారి గూడెంకు చెందిన ఎర్రమల నవ్య రెడ్డిని.. ఆమె భర్త నాగశేషు రెడ్డి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ శివారులోని కుక్కలగుట్టలో చున్నితో ఉరి వేసి హత్య చేశాడు. అంతకు ముందు ఏర్రుపాలెం పీఎస్ లో నవ్యరెడ్డి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

అయితే నాగశేషు రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అంతేకాదు నాగశేషురెడ్డి నవ్యరెడ్డిని బైక్‌పై తీసుకెళ్లినట్టు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాంతో నాగశేషురెడ్డిని అరెస్ట్ చేసి సీన్ రీ కన్‌స్రక్షన్ చేశారు. కుక్కలగుట్ట సమీపంలో స్లిపింగ్ టాబ్లెట్‌ ఇచ్చి చున్నీతో ఉరి వేసి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు.

అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్‌ఫోన్ నుంచి ఆమె తండ్రికి మెసేజ్‌ చేశాడు. ఇంజినీరింగ్‌లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు మెసేజ్ చేశాడు. నిందితుడు నాగశేషురెడ్డి పునేలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories