మల్లికార్జునస్వామి ఆలయంలో అపశృతి ..

మల్లికార్జునస్వామి ఆలయంలో అపశృతి ..
x
Highlights

పెద్దపల్లి జిల్లాలో ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో నిర్వహించిన అగ్నిగుండం దాటుతూ ఓ భక్తుడు అందులో పడిపోయాడు. తెలంగాణ...

పెద్దపల్లి జిల్లాలో ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో నిర్వహించిన అగ్నిగుండం దాటుతూ ఓ భక్తుడు అందులో పడిపోయాడు. తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం కావడంతో ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. మల్లన్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన అగ్నిగుండం మహోత్సవంలో పడిపోయిన భక్తుడు మళ్లీ లేచి పరుగులు పెట్టడంతో ప్రమాదం తప్పింది. భక్తులు.. ఆలయ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మల్లన్నస్వామి మహిమతోనే భక్తుడు ప్రాణాలతో బయటపడ్డాడని భావిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories