Bhupalpalli: వరద చుట్టేయడంతో నీటిలో మునిగిన లారీలు.. రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 10కిలోమీటర్ల ట్రాఫిక్ జాం

Lorries Submerged In Water Due To Flood
x

Bhupalpalli: వరద చుట్టేయడంతో నీటిలో మునిగిన లారీలు.. రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 10కిలోమీటర్ల ట్రాఫిక్ జాం

Highlights

Bhupalpalli: రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 10కిలోమీటర్ల ట్రాఫిక్ జాం

Bhupalpalli: భూపాలపల్లి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా మారాయి. మొరంచా వాగు ఉప్పొంగడంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో భూపాలపల్లి, పరకాల జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద చుట్టేయడంతో మొరంచా వాగులో లారీలు మునిగాయి. దీంతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ లారీ పైకెక్కి కూర్చున్నారు డ్రైవర్లు. దీంతో వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వాగులో వరద పెరగడంతో చుట్టుపక్కల కాలనీలు కూడా నీటిలో మునిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories