తెలంగాణలో బ్రాండ్లవారిగా లిక్కర్‌ ధరలు ఇవే

తెలంగాణలో బ్రాండ్లవారిగా లిక్కర్‌ ధరలు ఇవే
x
ప్రతికాత్మక చిత్రం
Highlights

తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల ముందు మద్యం...

తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల ముందు మద్యం ప్రియులకు కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. పెరిగిన ధరలకు సంబంధించిన పట్టికను ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏటా 19వేల 600 కోట్ల రూపాయలను మద్యం అమ్మకాల ద్వారా సమకూర్చుకోనుంది.

తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాటిల్‌ సామర్థ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.80, బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు పెరిగిన ధరల పట్టికను ఆయన విడుదల చేశారు.

లైట్ బీరుపై ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.110 వసూలు చేయనున్నారు. స్ట్రాంగ్ బీర్లపై రూ.12 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఇక మద్యం ఫుల్ బాటిల్ ధర ఆయా రకాల బ్రాండ్‌ను బట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి. సాధారణ మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 అదనంగా వసూలు చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిల్వ ఉన్న మద్యానికి పెంచిన ధరలు వర్తించవని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ సారి మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. రాజధాని హైదరాబాద్లో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో మద్యం ధరలు పెంచారు. అప్పుడు కూడా లిక్కర్ ధరలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో దిశ, సమత లాంటి అత్యాచార ఘటనల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలని మహిళలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తీవ్రమైన నేరాలన్నింటికీ మద్యమే కారణం అవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లోనూ భారీగా కోత విధించారు. అన్ని శాఖలు ఆర్థిక నియంత్రణ పాటించాలని అధికారులు, మంత్రులకు సీఎం కేసీఆర్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం ధరల పెంపును ప్రభుత్వం ఓ మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories