Kishan Reddy: ఛలో బాట సింగారం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత..

Kishan Reddy Stopped by police when visiting Double bed room houses in Shamshabad
x

Kishan Reddy: ఛలో బాట సింగారం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత..

Highlights

Kishan Reddy: పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలు

Kishan Reddy: రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వాహనాలను అడ్డుగా పెట్టి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను మధ్యలోనే అడ్డగించిన రాచకొండ సీపీ నేతృత్వంలోని పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకోవడంపై కిషన్ రెడ్డి పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రిని అయిన తనను ఎలా అడ్డుకుంటారని సీపీ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగారు. రఘునందన్, ఇతర నేతలతో కలిసి వర్షంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. బాటసింగారం వెళ్లి తీరుతానని చెప్పారు. అయితే, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories