Telangana: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

janagam Mla Senstional Comments
x

మూత్తి  రెడ్డి ఫైల్ ఫోటో 

Highlights

Janagam: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని, కార్యకర్తలు సూచించినవారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరవుతాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ బతికే ఉంటుందని వ్యాఖ్యానించారు ముత్తిరెడ్డి. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పార్టీ కార్యకర్తలు మాత్రమే అమలు చేస్తే ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఎంటి అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories