టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించనున్న సీపీఎం

టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించనున్న సీపీఎం
x
Highlights

హుజూర్‌నగర్ ఉపఎన్నికతో భవిష్యత్‌కు పునాది ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు ఇవాళ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్న సీపీఎం భవిష్యత్ ఎన్నికలకు పునాది వేస్తున్న టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ వామపక్షాలతో కలిసి పోటీచేసే అవకాశం

హుజూర్‌నగర్ ఉప ఎన్నికతో భవిష్యత్‌కు పునాది వేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతునివ్వగా ఇవాళ సీపీఎం కూడా మద్దతు ప్రకటించనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి టీఆర్‌ఎస్ పోటీకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్‌ ఎన్నికల వ్యూహాన్ని ఇప్పుడే అమలు చేస్తోంది టీఆర్ఎస్. ఈ ఎన్నికలో పోటీచేసేందుకు మొత్తం 119 నామినేషన్‌లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్‌ల ఉపసంహకరణకు బుధవారంతో గడుపు ముగియనుంది. అక్టోబరు 21న పోలింగ్‌జరగనుండగా, అక్టోబరు 24న కౌంటింగ్‌ జరుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories