Heavy Rains: భారీ వర్షాలు.. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ్

Heavy Rains: భారీ వర్షాలు.. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ్
x

Heavy Rains: భారీ వర్షాలు.. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ్

Highlights

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. తెలంగాణలో మొత్తం 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. వరి, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది వంటి పంటలకు గణనీయంగా నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. తెలంగాణలో మొత్తం 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. వరి, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది వంటి పంటలకు గణనీయంగా నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో

1,09,626 ఎకరాల్లో వరి,

60,080 ఎకరాల్లో పత్తి,

6,751 ఎకరాల్లో సోయాబీన్,

639 ఎకరాల్లో ఉద్యాన పంటలు పూర్తిగా ప్రభావితమయ్యాయని వివరించారు.

ఈ మేరకు జిల్లాల వారీగా పంటనష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories