Hyderabad: హైఅలర్ట్.. కేంద్ర నిఘా వర్గాల నీడలో భాగ్యనగరం

Heavy Police Security In Hyderabad
x

Hyderabad: హైఅలర్ట్.. కేంద్ర నిఘా వర్గాల నీడలో భాగ్యనగరం

Highlights

Hyderabad: పరేడ్ గ్రౌండ్ చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు

Hyderabad: హైదరాబాద్‌లో పొలిటికల్ పార్టీల వరుస కార్యక్రమాల దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు భాగ్యనగరాన్ని మోహరించాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక్రమాల దృష్ట్యా హైదరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా కూడా నగరంలోనే ఉండడంతో పరేడ్ గ్రౌండ్ పరిసరాలను సీఆర్పీఎఫ్ బలగాలు చుటుముట్టాయి. అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జిలు, హోటళ్లలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories