డ్రగ్స్ కిలాడీ.. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు...హైదరాబాద్‌లో అమ్మకం

Heavy Drugs Caught In The Mokila
x

డ్రగ్స్ కిలాడీ.. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు...హైదరాబాద్‌లో అమ్మకం

Highlights

Drugs: పోలీసులు వాళ్ల వ్యూహాలకు చెక్ పెడుతున్నారు.

Drugs: డ్రగ్స్ దందాలో ఇప్పటిదాకా నైజీరియన్లు లేదా మగవాళ్లు పట్టుబడడం చూశాం. కానీ ఓ యువతి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్‌ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఓ డ్రగ్ కిలాడీని పట్టుకున్నారు. ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసులు బుక్ చేశారు.

ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి టీం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు. డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని గుర్తించారు...అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు. ఆమె తరచూ గోవాకు వెళ్తూ ఉండడం.. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరచుకుంది. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. దాదాపు 52 గ్రాముల కొకైన్, 45 ఎల్‌ఎస్‌డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.

గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసిందని, నగరానికి తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గ్రాము రూ.20 వేలకు పైగా అమ్మిందని తెలిపారు. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారాడని చెప్పారు. డ్రగ్స్ పెడ్లర్ నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.

అంతేకాక, ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని వెల్లడించారు. శివ కూడా కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారి అనురాధకు సహకరించినట్లు వెల్లడించారు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నామని, వారి మూడు వాహనాలు సీజ్ చేసినట్లుగా చెప్పారు. వారి ఫోన్లు కూడా సీజ్ చేశామని వెల్లడించారు. అందులో వారి కస్టమర్లకు సంబంధించి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు. వీరిని రిమాండ్ చేసి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, వారి నెట్ వర్క్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వివరించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు.

డ్రగ్స్ రాకెట్ దందాలో నయా పోకడలు పోతున్నారు పెడ్లర్లు ...పోలీసులు వాళ్ల వ్యూహాలకు చెక్ పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories