Harish Rao: సీఎం రేవంత్, మంత్రులు రైతుల పంటలను పరిశీలించాలి

Harish Rao Visits Jangaon District
x

Harish Rao: సీఎం రేవంత్, మంత్రులు రైతుల పంటలను పరిశీలించాలి

Highlights

Harish Rao: ఎండిపోయిన పంటలను పరిశీలించిన హరీశ్ రావు

Harish Rao: జనగామ జిల్లా దేవురుప్పులలో పర్యటించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత వల్లే ఈ రోజు రైతులు అన్ని విధాల నష్టోపోతున్నారని హరీశ్ రావు విమర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు గుప్పించారు. రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని... మంచి నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ముఖ‌్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జిల్లాల్లో పర్యటించి.. పంట నష్టాన్ని అంచనా వేసి.. రైతులను ఆదుకోకపోతే... సచివాలయ ముట్టడికి పిలుపునిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories