Hanumakonda: విషాదం.. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృతి చెందాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతిసింగారం.

Ramya Vegirouthu
Published on: 14 July 2025 6:08 PM IST
Hanumakonda: విషాదం.. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి
X

Hanumakonda: విషాదం.. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృతి చెందాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతిసింగారం.

ఇటీవలి కాలంలో గుండెపోటు అనేది వృద్ధుల సమస్య మాత్రమే కాకుండా యువతను కూడా ఆక్రమిస్తోంది. మణితేజ మృతిచెందిన ఘటన కూడా ఈ విషయాన్ని మరింత హైలైట్ చేస్తోంది. నిపుణుల ప్రకారం, గుండెపోటుకి ప్రధాన కారణంగా రక్తప్రసరణలో అంతరాయం ఉండడం లేదా పూర్తిగా నిలిచిపోవడం చెప్పవచ్చు.

యువతలో గుండెపోటు పెరుగుతున్న తరహా ఎందుకు?

ఒత్తిడి, శారీరక చురుకుతనం లోపం, దురలవాట్లు (ధూమపానం, మద్యం), ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం వంటివి గుండె సమస్యలకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఈ సమస్యలు అధిక బరువు, మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ వంటి దుష్పరిణామాలకు దారి తీస్తాయని, చివరకు అవి గుండె రక్తనాళాల్లో బ్లాకులుగా ఏర్పడి కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ను కలిగించవచ్చని వారు సూచిస్తున్నారు.

యుక్త వయసులో హార్ట్ అటాక్ ప్రమాదకరం ఎందుకంటే..?

యువతలో గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సమస్య గుర్తించడానికి సమయమే ఉండకపోవచ్చు. ఒక్కసారిగా తీవ్రంగా దాడి చేసి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రతిఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

25 ఏళ్ల పైబడిన ప్రతి యువకుడు గుండె సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఆహార నియంత్రణ, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణతో పాటు జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావడం తప్పనిసరి.

ఈ విషాద ఘటన నేడు యువతికి ఒక్క హెచ్చరిక మాత్రమే కాదు.. సజీవ గమనికగా నిలవాలి.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story