తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం...
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో గవర్నర్ సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది.
కొత్త పురపాలక చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలి ఆమోదం కూడా పొందింది. వాస్తవానికి ఆ మరుసటి రోజే గవర్నర్ ఆమోదం పొంది కొత్త చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సదరు బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire