ఏపీ గవర్నర్‌ భార్యకు నరసింహన్‌ పరామర్శ

ఏపీ గవర్నర్‌ భార్యకు నరసింహన్‌ పరామర్శ
x
Highlights

సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకుంటున్న ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సతీమణి సుప్రవ...

సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకుంటున్న ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సతీమణి సుప్రవ హరిచందన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, విమల దంపతులు గురువారం పరామర్శించారు. తన సతీమణికి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని గవర్నర్ బిశ్వభూషణ్‌ వివరించారు. ఈ సందర్బంగా ఆమె త్వరగా కోలుకోవాలని నరసింహన్ దంపతులు ఆకాంక్షించారు. కాగా ఆమె కొంతకాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. దాంతో ప్రముఖ వైద్యులు గురవారెడ్డి ఆమెకు కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. కొద్ది రోజుల కిందటే హరిచందన్ ఏపీ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories