మెట్రో ప్రయాణికులకు శుభవార్త

మెట్రో ప్రయాణికులకు శుభవార్త
x
Highlights

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్‌అండ్‌టి మెట్రో సంస్థ శుభవార్త అందించింది. ఐటీ ఉద్యోగులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షెటల్ బస్సు...

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్‌అండ్‌టి మెట్రో సంస్థ శుభవార్త అందించింది. ఐటీ ఉద్యోగులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షెటల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్ల నుండి ఆఫీసుల వరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి లోని వివిధ ఐటీ కంపెనీలకు ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఉద్యోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా నెలకిందటే అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం అయింది. అయితే మధ్యలో కొన్ని స్టేషన్లు రిపేర్ లో ఉండటం వలన జూబిలీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ లో మాత్రమే మెట్రో ఆగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories