Nirmal: ఫుడ్ పాయిజన్ .. 23 మంది విద్యార్థినులకు అస్వస్థత

Girl Students fell ill due to food poisoning in Adilabad
x

Nirmal: ఫుడ్ పాయిజన్ .. 23 మంది విద్యార్థినులకు అస్వస్థత

Highlights

Nirmal: నిర్మల్ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రం కేజీబీవీలో ఘటన

Nirmal: నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కేజీబీవీ విద్యార్థినులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయగానే 6, 7 తరగతి చదువుతున్న 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా...వారిలో 15 మంది విద్యార్థులను నర్సాపూర్ మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపడతామని DEO తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories