తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు – ఉదయం 9.00 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు – ఉదయం 9.00 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
x

తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు – ఉదయం 9.00 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 21.27 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఉదయం 9.00 గంటల వరకు జిల్లావ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఆయన వెల్లడించారు.

జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో 21.71 శాతం, గుండాల మండలంలో 28.55 శాతం, జూలూరుపాడు మండలంలో 13.08 శాతం, లక్ష్మీదేవిపల్లి మండలంలో 19.93 శాతం, సుజాతానగర్ మండలంలో 28.21 శాతం, టేకులపల్లి మండలంలో 20.95 శాతం, యల్లందు మండలంలో 22.86 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 1,75,074 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9.00 గంటల వరకు 37,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, దీని ద్వారా సగటు పోలింగ్ శాతం 21.27 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories