మద్యం మత్తులో కూతుర్నే కడతేర్చాడు

మద్యం మత్తులో కూతుర్నే కడతేర్చాడు
x
మద్యం మత్తులో కూతుర్నే కడతేర్చాడు
Highlights

హైదరాబాద్ ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బాలాజీనగర్‌లో ఓ కసాయి తండ్రి మద్యం మత్తులో కూతుర్ని చంపేశాడు. ఐదేళ్ల చిన్నారి యామినిని...

హైదరాబాద్ ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బాలాజీనగర్‌లో ఓ కసాయి తండ్రి మద్యం మత్తులో కూతుర్ని చంపేశాడు. ఐదేళ్ల చిన్నారి యామినిని హతమార్చాడు. బాలాజీరావు నగర్ ‌లో ఉంటున్న దుర్గారావు వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్యా ఇద్దరు ఆడపిల్లలున్నారు. తాగుడుకు బానిసైన దుర్గారావు నిత్యం భార్య పిల్లల్ని వేధించేవాడు. నిత్యం పెళ్లాన్ని పిల్లల్ని కొట్టేవాడు. ఈ నేపథ్యంలో భార్య చుట్టు పక్కల ఇళ్లలో పనులు చేస్తుంది. దీంతో తల్లి పనికి వెళ్లిన సమయంలో తాగి వచ్చిన దుర్గారావు పెద్ద కూతురిని చితకబాది గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుర్గారావును అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories