బీజేపీలో చేరికపై ఎట్టకేలకు స్పందించిన విజయశాంతి

బీజేపీలో చేరికపై ఎట్టకేలకు స్పందించిన విజయశాంతి
x
Highlights

మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టుగా కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి...

మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టుగా కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి విజయశాంతి పులుస్టాప్ పెట్టేశారు. తాను బీజేపీలో చేరడంలేదని.. కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దాని ప్రచారం గాంధీభవన్ నుంచే ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్టు తెలిపారు. పార్టీ మార్పు విషయంలో హడావుడిగా నిర్ణయాలు తీసుకోనని చెప్పిన విజయశాంతి ఒకవేళ పార్టీ మారితే బహిరంగంగానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా ఉన్నారు. టీఆరెస్ నుంచి ఒక పర్యాయం మెదక్ ఎంపీగా గెలుపొందారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో తెరాసను వీడి కాంగ్రెస్ లో చేరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories