సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు... పరుగులు తీసిన ప్రజలు
సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపణలు కలకలం రేపాయి. హుజూర్నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, పాలకీడు మండలాల్లో 45 సెకన్ల పాటు భూ ప్రకంపణలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. చింతలపాలెం మండలంలో 20 రోజుల్లో 40 సార్లు భారీ శబ్దాలతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి వచ్చిన ఈ భూ ప్రకంపణలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Next Story




