Simhachalam: వైకుంఠ ఏకాదశి శోభ.. సింహాద్రి అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Simhachalam: ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు

Shekhar G
Published on: 23 Dec 2023 12:21 PM IST
Devotees Flock To Simhadri Appanna Temple
X

Simhachalam: వైకుంఠ ఏకాదశి శోభ.. సింహాద్రి అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Simhachalam: తెలుగురాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి దేవతలు శ్రీ హరిని.. ఉత్తర ద్వారంలో దర్శించుకునే రోజు కాబట్టి ఎంతో విశేషమైనది. సింహాచలంలో వైకుంఠ వైభవం అంబరాన్ని తాకుతుంది. సింహాద్రి అప్పన్న వైభవం భక్తులకు కన్నుల పండువగా ఉంది.

Shekhar G

Shekhar G

Next Story