విషాదం : తండ్రి మరణం తట్టుకోలేక..

విషాదం : తండ్రి మరణం తట్టుకోలేక..
x
విషాదం : తండ్రి మరణం తట్టుకోలేక..
Highlights

మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం నెలకొంది. చెన్నూరుకు చెందిన అరవెల్లి వసంతం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వసంతం...

మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం నెలకొంది. చెన్నూరుకు చెందిన అరవెల్లి వసంతం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వసంతం కుమార్తె సాయిప్రియ తండ్రి మరణంతో తీవ్రంగా దు:‌ఖం చెందింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఆ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. గోదావరిలో దూకి మరణించింది.

తండ్రి వసంతం మృతదేహాన్ని వాహనంలో తీసుకువెళుతుండగా కుమార్తె సాయిప్రియ తీవ్ర వేదనకు గురయింది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళుతున్న ఆమె కారును ఆపించింది. కడుపులో తిప్పుతోందని వాంతులు అవుతున్నాయని కారు దిగింది. గోదావరి బ్రిడ్జి వద్ద దిగి గోదావరి దూకి మరణించింది. సాయి ప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories