మంచిర్యాల జిల్లాలో మరో కరోనా కేసు..

మంచిర్యాల జిల్లాలో మరో కరోనా కేసు..
x
Highlights

మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో శనివారం రోజున జిల్లాలో మరో మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పూర్తివివరాల్లోకెళితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన 30ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అదికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది బాధిత మహిళ కుటుంబీకుల వివరాలు సేకరించారు. మహిళకు సంబంధించిన 12 మందిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న మహిళ 40 రోజుల కిందట కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో పురుడు పోసుకుని మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత తన సొంత గ్రామానికి చేరుకుంది. కాగా ఈ మధ్య కాలంలో కాస్త అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ ఆ మహిళను కరీంనగర్‌కి తీసుకువెళ్లారు. కాగా అక్కడి వైద్యులు ఆమెకు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ మహిళకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల వెంటనే హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. ఆమె తల్లితో పాటు మరికొందరికి గాంధీలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories