ఇవాళ మాణిక్కం ఠాగూర్‌తో కాంగ్రెస్‌ నేతల సమావేశం

Manickam Tagore: మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అంతర్గత వ్యవహారాలపై చర్చ

Jyothi
Published on: 18 Aug 2022 11:23 AM IST
Congress Leaders Meeting With Manickam Tagore Today
X

ఇవాళ మాణిక్కం ఠాగూర్‌తో కాంగ్రెస్‌ నేతల సమావేశం

Manickam Tagore: ఇవాళ మాణిక్కం ఠాగూర్‌తో కాంగ్రెస్‌ నేతల సమావేశంకానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అంతర్గత వ్యవహారాలపై చర్చించనున్నారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక వనపర్తి డీసీసీ అధ్యక్షుడు.. సీనియర్స్ సహకరించడం లేదని ఆరోపించారు. దీంతో నేతలపై మాణిక్కం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇలా వ్యవహరిస్తే ఇద్దరినీ సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా..మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లేఖలో వివరించారు. ఎర్రశేఖర్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు అనిరుధ్‌రెడ్డి. ఎర్రశేఖర్‌.. పార్టీలో చేరినప్పుడు ఉన్నట్లుగా.. ఇప్పుడు ఉండటం లేదన్నారు.

Jyothi

Jyothi

Next Story