తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి పంజా

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి పంజా
x
Highlights

తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా‌, వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.

తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా‌, వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 9 అయినా.. మంచుదుప్పట్లు వీడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. మినుములూరులో సోమవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడి కాఫీ బోర్డులో ఆదివారం 12 డిగ్రీలు నమోదు కాగా సోమవారానికి 8 డిగ్రీలకు పడిపోయింది. ఇక అరకు లోయలో 12.7 డిగ్రీలు, చింతపల్లిలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఏజెన్సీ, మన్యం ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories