CM Revanth Reddy : హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం ప్రసంగం..చరిత్ర సృష్టించనున్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం ప్రసంగం..చరిత్ర సృష్టించనున్న రేవంత్ రెడ్డి
x
Highlights

హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం ప్రసంగం..చరిత్ర సృష్టించనున్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అంతర్జాతీయ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సింపోజియంలో ప్రసంగించేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ క్యాంపస్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు, దాని ప్రభావంపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ, పారిశ్రామిక, విద్యా రంగాల ప్రముఖులు ఈ వేదికపైకి రానున్నారు.

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఏఐ విజన్

ఈ సదస్సులో ముఖ్యంగా “AI as Infrastructure and Compute Power: Impact on Livability and Workforce” అనే అంశంపై జరిగే ప్యానెల్ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఏఐ అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మాత్రమే కాదని, అది దేశాభివృద్ధికి అవసరమైన ఒక ప్రాథమిక మౌలిక సదుపాయం అనే కోణంలో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించనున్నారు. డేటా సెంటర్లు, కంప్యూట్ కారిడార్స్, ఎనర్జీ సిస్టమ్స్ వంటివి సామాన్యుల జీవన ప్రమాణాలను ఎలా మారుస్తాయి? ఉపాధి అవకాశాలను ఎలా మెరుగుపరుస్తాయి? అనే అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను ఆయన ప్రపంచానికి వివరించనున్నారు.

ఏఐ సిటీ.. డేటా హబ్‌గా తెలంగాణ

తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఏఐ సిటీ ప్రాజెక్టు గురించి సీఎం ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో కంప్యూట్ సామర్థ్యాలను పెంచడం, డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన పాలసీలు తీసుకురావడం, నిరంతర విద్యుత్ సరఫరా, గ్రీన్ ఎనర్జీ వినియోగం వంటి అంశాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలు తెలంగాణను తమ డేటా హబ్‌గా ఎంచుకునేలా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, స్టార్టప్‌లకు ఇస్తున్న ప్రోత్సాహకాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేలా చర్చించనున్నారు.

ఉద్యోగాలు - నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్

టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనల నేపథ్యంలో, ఏఐ ద్వారా కొత్త ఉపాధి మార్గాలను ఎలా సృష్టించవచ్చో సీఎం వివరించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రంగంలో ఏఐని అనుసంధానం చేయడం వంటి వినూత్న ప్రయోగాలు ఈ చర్చల్లో హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు కలిసి పని చేయడం ద్వారానే సమాజంలో డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చని రేవంత్ రెడ్డి తన తెలంగాణ మోడల్‌ను ప్రదర్శించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories