CM Revanth Reddy: ప్రజాభవన్‌లోని కార్యాలయాలను ఉపయోగించుకుంటాం.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోము

CM Revanth Reddy Chit Chat With Media
x

CM Revanth Reddy: ప్రజాభవన్‌లోని కార్యాలయాలను ఉపయోగించుకుంటాం.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోము

Highlights

CM Revanth Reddy: మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. MCRHRDలో ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటామని తెలిపారు.

CM Revanth Reddy: మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. MCRHRDలో ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటామని తెలిపారు. ప్రజాభవన్‌లోని కార్యాలయాలను సైతం ఉపయోగించుకుంటామని..కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించమని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం 12 నుంచి 13 గంటలే కరెంట్‌ ఇచ్చిందని..శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుందని..శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి...కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories